20, జనవరి 2009, మంగళవారం

ఏది "సత్యం"??



భారత ఐటి రంగానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన సత్యం కంప్యూటర్స్
ప్రపంచానికి ఇచ్చిన షాక్.. నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాం.

ఒకపక్క ఆర్ధికమాంద్యం వల్ల, అమెరికా ప్రాజెక్టులు.. క్లైంట్లు చేతులెత్తేయంటంతో...
పడిన దెబ్బకి కాస్త లేచి నిలబడగలిగే సమయంలో, ఈ సత్యం వార్త మరో దెబ్బలా తగిలి...
వీకెండ్ వస్తేనే గజగజ వణికిపోయే సాఫ్వ్టేర్ ఇంజనీరు.. ఇప్పుడు.. ఈ ఐటిపై పడ్డ దెబ్బమీద
దెబ్బకి..., ప్రతినోటా... వస్తున్న గాలి వార్తలకు వీక్ డేస్ లో కూడా వీకైపోవాల్సిన
పరిస్తితి వచ్చింది...

మన ఊరిలో కంప్యూటర్స్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా అందరికీ సులువుగా తెలిసే ఒకే ఒక్క కంపెనీగా
సత్యం కంపూటర్స్ కి ప్రత్యేక స్క్షానం ఉంది. సత్యంలో పనిచేస్తున్నా, అంటే ప్రజలు బ్రహ్మరధం
పట్టేవారు, వారికే పెద్దపీటవేసి... నలుగురిలో చెప్పుకునేవారు...,
పెళ్ళిసంభందాల విషయంలో కూడా.. అదొక ఆస్తిలానే లెక్కవేసేవారంటే...
మీరు నమ్మలేకపోవచ్చు...

నేను ఫలానా కంపెనీలో చేస్తున్నా అంటే... అది సత్యంకంటే పెద్దదేనా?
అని జనాలు అడిగేవారంటే.. దానిబట్టే చెప్పొచ్చు...
అది జనాల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో...

మన ఆంధ్రావారిచేత స్థాపింపబడి అనతికాలంలోనే ఎదిగిన ఎకైక కంపెనీ కావటం వల్లనే ఇంత పేరు
రావటానికి కారణంకావొచ్చు...

మనం చేసే పని మనకు నచ్చినా నచ్చకపోయినా... ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగం, హోదాతో
సరిపెట్టుకుని రోజులు నెట్టుకొస్తున్నా.... ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ కంపెనీ,
డ్రీమ్ జాబ్ అంటూ ఉంటుంది... ఎప్పటికైనా ఆ కంపెనీ ట్యాగ్ మెడలోవేసుకోవాలి అనే
సంకల్పమూ ఉండొచ్చు..., అలానే చాలామంది మనసుల్లో డ్రీమ్ గా సత్యం కూడా ఉంది...,
నాకున్న ఉద్యోగ అనుభవంలో నేను స్వయంగా చూసి మెచ్చి నచ్చిన ప్రోసెస్ లు సత్యం కంపూటర్స్ లో
చూసాను... అప్పట్నుండీ నాకూ అది డ్రీమ్ కంపెనీగా మారింది...

కార్పొరేట్ కల్చర్ మనకు మనస్ఫూర్తిగా నచ్చకపోయినా!!,
మనకు అది తప్ప వేరే ఏదీ బ్రతుకుతెరువులేకపోతే అదే... గొప్ప కల్చర్ గా చెప్పుకుంటాం...,
ఇష్షంలేకున్నా కష్షమైనా అలవాటు చేసుకోవాళ్ళిందే కదా మరి!!!

మనం కంపెనీ మారటానికో... లేక జాబ్ సంపాదించటానికో పెట్టే రెజ్యూమ్ లో ఎంత
నిజాలుంటాయో మనకే తెలుసు... రెజ్యూమ్లో వ్రాసినవి నూరుశాతం కరెక్టేనా?
అని ప్రశ్నించుకుంటే ఎంతశాతం నిజాలుంటాయి?,
నిజంగా నిజాలు చేప్తే మనకు ఉద్యోగం వచ్చిఉండేదా?, నిజాలు చెప్పి ఎంతమంది మనలో
ఉద్యోగాలు సంపాదించి ఉండొచ్చు..??, లాంటి ప్రశ్నలువేసుకుంటే ఉద్యోగమే చెయ్యలేం...

క్లైంటుకు కంపెనీలు, ప్రాజెక్టులకోసం చూపించే లెక్కల్లో ఎంత నిజం ఉంటుంది?,
అలాగే మనం చేసిన పనిలోనూ.. చూపించేదాంట్లోనూ ఎంత నిజం ఉంటుంది...?
నిజంగా చెప్పాలంటే... కార్పొరేట్ అంటేనే మోసాలకు జన్మస్ధానం అని చెప్పొచ్చు.

అలాంటి కార్పొరేట్ కు వెన్నతో పెట్టిన విద్యే... లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించటం.

అదే పని రామలింగరాజు చేసినట్లు తోచినా..., ఇప్పుడు అదే పెద్ద స్కామ్ అని చిత్రిస్తున్నాయి
ఇప్పుడొస్తున్న కధనాలు..

మోసం చేసి డబ్బులు మళ్ళించటానికి... ఒక కంపెనీని.. 20 ఏళ్ళపాటు... పెంచి పోషించి,
వేలమందికి ఉద్యోగాలిచ్చి..., తెలుగువాడు గర్వపడే స్ధానంలో కంపెనీని నిలపాలా??

డబ్బాసే ఉంటే?, భైర్రాజు ఫౌండేషన్ ద్వారా.. వేలమందికి... పళ్ళెటూర్లలో ఐటి సర్వీసెస్ లో
పనిచేసే భాగ్యం కలిగించి...

మంచినీరే ఎరుగని ఊరికి..., ఏన్నో ఏళ్ళుగా సమస్యను చూస్తూ... ఎన్నో ప్రభుత్వాలు
మారినా... ఎవరూ చెయ్యలేని పనిని చేసి చూపించాల్సిన అవసరం ఉందా...?,
అలాగే ఆరోగ్యం, పారిశుధ్యంకు కోట్లు ఖర్చుపెట్టి... పనుల చేయించాలా?

ప్రాణాలవిలువ తెలుసుకుని..., అత్యవసర పరిస్ధితులకు తగినవిధంగా స్ఫందించే సాంకేతిక
పరిజ్ఞానంతో...,108 సేవలతో ఎన్నో ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందంటారా??

చేసిన... చేస్తున్న పనులలో ఏదీ లాభాపేక్షతో చేసినవిగా నాకు అనిపించలేదు...
రాజకీయ అవసరాలు అసలే కనిపించలేదు... ఏనాడు మీడియాముందుకొచ్చి...
మేం ఇది చేస్తున్నాం అని చెప్పుకోలేదు...

ప్రతీ కార్పొరేట్ కి ఒక సేవా సంస్ధ రిజిష్టరై ఉంటుంది... అది కంపెనీకి వచ్చిన లాభాల్లో
ఇంత శాతం మేం సేవచేస్తున్నాం, అని చూపించుకోవటంకోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...,
కానీ సత్యంకు భైర్రాజు ఫౌండేషన్ అలాంటిది కాదని... రాజు తన ఆశక్తితో నడుపుతున్నదని
తెలిసిన తరువాత వీళ్ళు చేస్తున్నది ఒక మహా కార్యం అని సదభిప్రాయం కలిగింది.

కనీసం ఎంతో కొంతశాతం చేసాం అని లెక్కలు చూపించుకోటానికైనా చేసిన కార్పొరేట్లైనా ఉన్నాయా?,
అంటే నాకు తెలిసి లేవనే చెప్పాలి!!

ఈ సేవలన్నీ చేస్తూ కూడా.. రాజు మోసం చేసారు అంటే నేను జీర్ణించుకోలేని విషయం.
ఇప్పుడు రాజు చేసినది పెద్ద ఫ్రాడ్ అని చెప్పుకునే వార్తల్లో ఎంత నిజముందో
ఆ దేవుడికే తెలియాలి మరి...

కానీ ఒక్కటి మాత్రం నిజం.. వ్యాపారంలో నష్టం-లాభం ఎవరూ తప్పించుకోలేనివి...,
అలానే మన కష్టమర్స్ అందరికీ న్యాయం చెయ్యాలి అంటే అదీ కాని పనే!!

నష్టాలొస్తే ఎవరొకరికి గట్టి దెబ్బ తగలక మానదు... కొన్ని విషయాలు ప్రాణంమీదకొస్తే కాని
తెలియవు మనం చేసింది తప్పే అని... ఆ సమయానికి అది.. ఒక వ్యూహం కావచ్చు...
పండితే దానికి ప్రశంసల వర్షం కురుస్తుంది..., పండకపోయి బెడిసికొట్టి అది బడామోసం
అయ్యే అవకాశమూ ఉంది...!!

ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని రోజులివి. అందరిదీ స్వార్ధమే..., ఆ రాజకీయ పార్టీ
ఈ రాజకీయ పార్టీ ఒకరినొకరు తక్కువచేసుకుని మాట్లాడటమే కాని, అసలు నిజమేదో తెలిసుకునే
ప్రయత్నం చేస్తున్నట్లయితే కనిపించడంలేదు.
ఏమో ఈ ఆటలో అందరూ దొంగలేనేమో...అదీ చెప్పలేం.

మీడియా గురించి చెప్పనే అక్కర్లేదు.. ఏది జరిగినా ఆకాశం.. భూమి.. ఒక్కటై ప్రళయం వచ్చినా!!
పడిపోని బిజినెస్ ఏంటి అంటే... మీడియా అనిపిస్తుంది.. ఏది జరిగినా వాళ్ళకు బిజినెస్సే...

కులానికో ఛానల్.. పార్టీకో పత్రిక.. ఆహా.. ఏబాగుందీ బిజినెస్...!!!,
ఏది చూపించాలో ఏది చూపించకూడదో తెలియని.. మీడియాకు ఒక నియంత్రణ బోర్డ్లంటూ
ఉండవా??, ఉంటే అవి నిద్రపోతుంటాయా??.

ముంబై తాజ్ హోటల్లో జరిగే ఆపరేషన్లు టీవిలో చూస్తూ ఉగ్రవాదులు ఏం జరుగుతుందో
ఎలా తప్పించుకోవాలో ప్లాన్లుగీసుకున్నారంట..., అది చాలు ఉదాహరణగా చెప్పుకోవటానికి
మన మీడియా ఎంత అప్టుడేట్ గా ఉందో...

స్వతంత్ర్యం కావాలి కావాలి అని తెల్లవాళ్ళను... తరిమి తరిమి కొట్టి తెచ్చుకున్న మనం...
మళ్ళీ మా పైసాలకన్నా మీ యుకే పౌండ్లే భరువని నమ్మి బానిసల్లా వాళ్ళవెంట మనం
వెళ్ళేలా చేసిందీ ఈ కార్పోరేటే కదా!!!, అలా అని ఇంత చదువూ చదివి... బ్రతుకు బండి
నెట్టుకోలేని ఉద్యోగాలు చేస్తూ నేను గాంధేయవాదిని.. నా దేశపు నూలు వస్త్రాలే వేసుకుంటా,
నా దేశకోసం సేవలందించే ఉద్యోగమే చేస్తా అంటూ బ్రతకగలమా??

మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు శనివారం వస్తే..., మళ్ళీ ఆ రోజు ఆఫీసుకు సెలవని...
ఎవరూ రారని... ఆగష్టు 14నే జరిపిన పుణ్యం కార్పొరేట్ కల్చర్ కే దక్కింది...
అది చూసి నేను పాకిస్తాన్ లో ఉన్నానా? లేక భారదేశంలో ఉన్నానా అనిపించింది.
ఇదేనేమో గ్లోబలైజేషన్ అంటే..??, అని సరిపెట్టుకున్నా చివరికి...

తప్పదు... ఈ కార్పొరేట్ ప్రపంచంలో బ్రతికినంతకాలం మనఃస్సాక్షి చంపుకోవాల్సిందే,
వీటినుండి తప్పించుకోలేం.

పోటీ పోటీ అంటూ.. ప్రపంచంతోపాటు పరిగెడుతూ ఉన్నమనం...
నిలబడి నీళ్ళు ఎలాగూ తాగలేం అని నిర్ణయించుకుని...
పరుగెడుతూ పాలే త్రాగుతున్నాం...
పడిలేస్తూ ఇలా మనల్ని మోసంచేసుకుంటున్నాం.

ఈ సత్యం కధలో మోసం ఉండి తప్పించినా తప్పించొచ్చు...
మోసమేలేదు... అంతా కల్పితకధ అని చెప్పినా చెప్పొచ్చు...

ఈ కధ కంచికి ఎలా చేరినా... మనం ప్రేక్షకులలాగా చూడగలం తప్ప ఏమీ చేయలేం...!!

ఇప్పటివరకూ ఎన్ని జరగలేదు... మోసాలు? జరిగినవాటికి అన్నిటిననీ నిరూపించి..
బాధ్యులకు... శిక్షపడేలా చేసి... న్యాయమే జరిగిందంటారా??

ఈ విషయంలో నాకు తెలిసింది వ్రాసి వాక్ (బ్లాగ్) స్వాతంత్య్రాన్ని చాటి చెప్పటం తప్ప
నేను చేయగలిగేది ఏదీ తోచలేదు...

పై విషయాలలో నాకున్న జ్ఞాణంతో చెప్పిన, నా ఆభిప్రాయాలు మాత్రమే అని మనవి.

Related Posts Plugin for WordPress, Blogger...